తాడిపత్రి పట్టణం టైలర్స్ కాలనీలో పర్యటించిన జనసేన టీడీపీ

తాడిపత్రి, బాబు షూరిటీ – పవనన్న గ్యారెంటీ. టీడీపీ కార్యక్రమంలో భాగంగా జనసేన కార్యకర్తలతో కలిసి మంగళవారం తాడిపత్రి పట్టణం కృష్ణాపురం 10వ రోడ్డు, టైలర్స్ కాలనీ, మెయిన్ రోడ్ల నందు తాడిపత్రి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ జెసి అష్మిత్ రెడ్డి పర్యటించి ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ, జనసేన నాయకులు, మెగా అభిమానులు కార్యకర్తలు, జెసి అనుచరులు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.