వచ్చే ఎన్నికలలో జనసేన ప్రభంజనం సృష్టిస్తుంది

విశాఖ దక్షిణ నియోజకవర్గం, ఏపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో జనసేన పార్టీ ప్రభంజనం సృష్టిస్తుందని విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు, 32 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు తెలిపారు. సోమవారం ఆయన నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. ప్రతి గడపగడపకు వెళ్లి ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నారు. అర్హులైన అందరికీ ప్రభుత్వ నిధులతో పాటు ఇటు తన సొంత నిధులతో సహాయం చేసేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం 39 వ వార్డు పెర్రి వీధిలో నవవధువు మల్లిక కు పట్టుబట్టలు, బంగారు తాళిబొట్టు అందజేశారు. అలాగే మరో పెళ్లి కుమార్తెకు కూడా ఆయన సహాయం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ జనసేనపై అధికార పార్టీ ఎంత విష ప్రచారం చేసినప్పటికీ ప్రజలు అందరూ పవన్ కళ్యాణ్ వైపే ఉన్నారని చెప్పారు. చాలామంది పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని ఆశిస్తున్నారని వెల్లడించారు. వచ్చే ఎన్నికల తర్వాత సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు. ఆ ప్రభుత్వంలో జనసేన పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో 39వ వార్డువార్డ్ ప్రెసిడెంట్ మైలపల్లి చిన్న, 29వ వార్డు అధ్యక్షులు శ్రవణ్, గణేష్, ముత్యాల నాయుడు, హేమ, దేవుడమ్మా, కుమారి, పద్మ, కుమారి, కందుల కేదార్నాథ్, కందుల, బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.