అల్పాహారం పంపిణీ చేసిన జనసేన కార్యకర్తలు

నందిగామ: ఐతవరం గ్రామం వద్ద జాతీయ రహదారిపై కట్టలేరు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా భద్రతా చర్యలో భాగంగా హైదరాబాద్ వైపు వెళుతున్న వాహనాలు మండలంలోని పేరకలపాడు వద్ద పోలీసులు నిలుపుదల చేశారు. గత రాత్రి నుండి నిరీక్షిస్తున్న వాహనదారులకు డ్రైవర్లకు కంచికచర్ల మండల అధ్యక్షుడు నాయన సతీష్ ఆధ్వర్యంలో జనసేన కార్యకర్తలు సహాయ కార్యక్రమాలు చేపట్టారు. లారీ డ్రైవర్లకు క్లీనర్లకు ఇతర ప్రయాణికులకు ఉదయం అల్పాహార పొట్లాలు అందజేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో జనసైనికులు సహాయ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నారని నాయిని సతీష్ తెలిపారు. నదీ పరివాహక ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం కమిటీ నెంబర్ తోట ఓంకార్, మండల కార్యదర్శి కె. దేవేంద్ర, వనపర్తి పద్మారావు మరియు జనసైనికులు పాల్గొన్నారు.