రాజంపేట మండలంలో జనంలో జనసేన కార్యక్రమం
ఉమ్మడి కడప జిల్లా, రాజంపేట నియోజకవర్గం: రాజంపేట మండలం లో ఆదివారం “జనంలో జనసేన” కార్యక్రమం బాలరాజు పల్లె, రోళ్లమడుగు, బుడుగుంట పల్లె, పెద్దూరు యస్.సి.కాలనిలలో జనసేన నాయకులు జనసైనికులు ఇంటింటికి ప్రచారం చేసి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను, జనసేన పార్టీ సిద్దాంతాలను ఎన్నికల గుర్తు “గాజు గ్లాస్”ను వివరించి కరపత్రాలను పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజలు ఎదురుకుంటున్న సమస్యలను సేకరించి రానున్న ఉమ్మడి ప్రభుత్వంలో జనసేన పార్టీ ద్వారా పరిష్కారం చూపుతామని జనసేన నాయకులు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు యల్లటూరు సుబ్బరాజు, కోలాటం హరికృష్ణ, అబ్బిగారి గోపాల్, కాసారపు నరేష్, బండ్ల నాగరాజు, పూల మురళి, మల్లెం శ్రీనాథ్, గురుప్రసాద్, బండ్ల సాయి కిరణ్, నాని, నరసింహ, చలపతి, సిద్దు, తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-28-at-6.25.31-PM-1024x462.jpeg)