జనంలోకి జనసేన – ఇంటింటికి మీ వరుపుల తమ్మయ్య బాబు

  • ప్రత్తిపాడు నియోజకవర్గంలో జనసేన విజయం సాధించే విధంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారినీ ముఖ్యమంత్రి గా చూడటమే లక్ష్యం గా ప్రతి గ్రామంలో ”జనంలోకి జనసేన” అనే కార్యక్రమం ద్వారా నియోజకవర్గ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ ఎప్పుడు ప్రజలతో మమేకమై వారికి తోడుగా గా ఉంటూ ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి వరుపుల తమ్మయ్య బాబు

ప్రత్తిపాడు నియోజకవర్గం: ఏలేశ్వరం మండలం, తిరుమల గ్రామంలో వరుపుల తమ్మయ్య బాబు జనసేన శ్రేణులతో కలిసి ఇంటింటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వంలో ప్రజలకు జరుగుతున్న నష్టాలను, వారు చేస్తున్న దౌజన్యాలను వివరించారు. ప్రజలకు మేలు జరగాలంటే జనసేన ప్రభుత్వం అధికారం లోకి రావాలని, పవన్ కళ్యాణ్ గారు చేసిన కౌలురైతు భరోసా యాత్ర గురించి. ఇప్పుడు చేస్తున్న వారాహి యాత్ర గురించి జనసేన పార్టీ సిదాంతాలు గురించి వివరిస్తూ జనసేన పార్టీ కర పత్రాలను పంచడం జరిగింది. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నల్లల రామకృష్ణ, ఏలేశ్వరం మండల అధ్యక్షుడు పెంటకోట మోహన్, కొట్టేటి గంగాధర్, ఏలేశ్వరం మండల జనరల్ సెక్రటరీ గంగిరెడ్ల మణికంఠ, ఏలేశ్వరం మండల ఉపాధ్యక్షుడు అచ్చే వీరబాబు, మండల సెక్రటరీ కోలా వీరబాబు, తిరుమాలి గ్రామ జనసేన అధ్యక్షుడు కానూరి బ్రహ్మానందం, ఉపాధ్యక్షుడు కోలా బుజ్జి, నాయకులు ఎర్ర అప్పారావు, కోరుకొండ వెంకటరమణ, కోరుకొండ అప్పారావు, పసల ఇంద్రయ్య, మాకిరెడ్డి మణికంఠ, దాడిశెట్టి ఆదినారాయణ తదితరులు మిగతా నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.