జనసైనికుడు వీరబాబు కుటుంబానికి తుని జనసైనికుల ఆర్థిక సహాయం

తుని నియోజకవర్గం: ఇటీవల కాలంలో తుని నియోజకవర్గం, తునిమండలం, సి.హెచ్ అగ్రహారం గ్రామానికి చెందిన ఆకుల వీరబాబు అనే జనసైనికుడు ప్రమాదవశాత్తు మరణించటం జరిగింది. ఆ కుటుంబానికి ఏదైనా ఆర్థిక సహాయం చేయాలన్న ఆలోచనతో తుని మండల అధ్యక్షులు ధారకొండ వెంకటరమణ ఆదేశాలు మేరకు గండి శివజీ ఆధ్వర్యంలో వీరబాబు కుటుంబానికి తుని జనసైనికులు 32000/- రూపాయల ఆర్ధికసహాయం సోమవారం అందించటం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు వంగలపూడి నాగేంద్ర, పలివెల లోవరాజు మాట్లాడుతూ మీ కుటుంబానికి ఎప్పుడూ జనసేన పార్టీ అండగా ఉంటుందని, మన సామాన్య ప్రజలకోసం పవన్ కళ్యాణ్ గారు మనకి ఎప్పుడూ అండగా ఉంటారని చెప్పటం జరిగింది. మీకు ఎప్పుడూ ఏ విధమైన సహాయం కావాలన్నా తుని నియోజకవర్గం జనసైనికులు మీకు అందుబాటులో ఉంటారని చెప్పటం జరిగింది. ఈ కార్యక్రమంలో తుని నియోజకవర్గం జనసేన నాయకులు అద్దేపల్లి బాలాజీ, లట్టాలా నాగేశ్వరావు, నిమ్మల లోవసూరి బాబు, బొప్పన రాంబాబు, మేకినీడి శ్రీనివాసు, ముక్కురపు శివ, గట్టెం నాగబాబు, గాది రమేష్, సిగిరెడ్డి రాము, పామి సాయి, మైనం మణికంఠ నరిశే నాగేశ్వరావు, నక్కా లక్ష్మణ్, నానాజీ, మరియు తుని నియోజకవర్గ జనసైనికులు పాల్గొనటం జరిగింది.