రామవరప్పాడు గ్రామంలో జనసేన క్రియాశీల సభ్యత్వ కార్యక్రమం

కృష్ణా జిల్లా, గన్నవరం నియోజకవర్గం, రామవరప్పాడు గ్రామంలో కృష్ణ జిల్ల జనసేన పార్టీ అద్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ ముఖ్య అతిధిగా క్రియాశీల సభ్యత్వ కార్యక్రమం జరిగింది. కృష్ణ జిల్ల జనసేన పార్టీ అద్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ మాట్లాడుతూ… జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రవేశ పెట్టిన క్రియాశీల సభ్యత్వం యొక్క ముఖ్య ఉద్దేస్యం మరియు దాని వలన కలిగే ప్రయోజనాలను గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.