కిడ్నీ సమస్యతో బాధపడుతున్న మహిళకు జనసేన భరోసా

పిఠాపురం టౌన్ 2వ వార్డ్ లో కొంత కాలంగా రెండు కిడ్నీలు పాడయ్యి తీవ్ర ఇబ్బంది పడుతున్న సుధారాణి ఇంటికి ఆదివారం జనసేన నాయకులు వెళ్లి బియ్యం బస్తా కూరగాయలు సాయం చేసి ఆమె ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. కొన్ని రోజులుగా మా కుటుంబం చాలా ఇబ్బంది పడుతోంది. ఏం చేయాలో అర్థం కావటం లేదని వారు తెలియజేయడంతో పి.ఎస్.ఎన్. మూర్తి మాట్లాడుతూ ఈ విషయంపై జనసేన నాయకుల దృష్టిలోకి తీసుకువెళ్లి తగిన సాయం అందిస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కసిరెడ్డి నాగేశ్వరరావ, కర్రి కాశీ విశ్వనాథ్, పెంకే జగదీష్, పెదిరెడ్ల భీమేశ్వరరావు, పెనుముల్లా సత్యనంద రెడ్డి, కోలా దుర్గాదేవి, ముప్పన రత్నం, వినకుండా అమ్మాజీ, యండ్రపు శ్రీనువాసు,తోట సతీష్, పబ్బినీడి ప్రసాద్ పిట్ట చిన్న, నాయకులు జనసైనికులు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.