బిట్ల రమేష్ ఆధ్వర్యంలో జనసేన-బిజెపి సమన్వయ సమ్మేళన సమావేశం

తెలంగాణ, జనసేన పార్టీ ముషీరాబాద్ నియోజకవర్గం కో- ఆర్డినేటర్ బిట్ల రమేష్ ఆధ్వర్యంలో జనసేన-బిజెపి సమన్వయ సమ్మేళన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యులు జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాధారం రాజలింగం పాల్గొని జనసేన-బిజెపి ఉమ్మడి అభ్యర్థి పూసా రాజుని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో బిజెపి జాతీయ, రాష్ట్ర నాయకులు, జనసేన నాయకులు దామోదర్ రెడ్డి, సురేష్ రెడ్డి మరియు ముషీరాబాద్ నియోజకవర్గ నాయకులు జనసైనికులు పాల్గొన్నారు.