రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని జనసేన డిమాండ్

ఎమ్మిగనూరు నియోజకవర్గం, తీవ్ర వర్షాలకు చేతికి వచ్చిన పంటలు దెబ్బతిని మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారని ప్రభుత్వం గుర్తించి ఆదుకోవాలని ఎమ్మిగనూరు జనసేనపార్టీ నియోజకవర్గ ఇంచార్జి రేఖగౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిధిలోని గోనెగండ్ల, నందవరం, పరిసర గ్రామాల్లో బుధవారం రోజు పంట పొలాల దగ్గర రైతులకు నేరుగా కలిసి నష్టపోయిన పంటల గురించి తెలుసుకున్నారు, ఈ కార్యక్రమము నందు చేనేత విభాగం కార్యదర్శి రవి ప్రకాష్, మీడియా ఇంచార్జ్ బాషాగనిగా, నాయకులు షబీర్, రాహుల్, వెంకటేష్, షఫీ ,కాసిం, బాషా, భాస్కర్, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.