ప్రభుత్వ పాఠశాలలకు సెలవులు ప్రకటించాలి జనసేన డిమాండ్

అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గ నాయకులు సాకే మురళి కృష్ణ, జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి బొమ్మన పురుషోత్తమ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మూడో వేవ్ కేసులు ఎక్కువవుతుండ వల్ల విద్యార్థులు చాలా మంది కరోనా బారిన పడుతున్నారు వారి జీవితాలతో ఆడుకోవద్దని ప్రభుత్వానికి తెలియజేస్తున్నామని… అదేవిధంగా ఇప్పటికే రాష్ట్రంలో పలు పాఠశాలలో విద్యార్థులు కరోనా బారిన పడి బాదపడుతున్నారు ప్రభుత్వం వెంటనే తక్షణం స్పందించి కరోనా తగ్గేంత వరకూ పాఠశాలలకు సెలవులు మంజూరు చేయవలసినదిగా జనసేన పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నాము విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సాయిశంకర్, మదు, ప్రవీణ్, పెద్దయ్య, శేఘు రాము తదితరులు పాల్గొన్నారు.