మునిసిపల్ పారిశుద్ధ్య కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని జనసేన డిమాండ్

హిందూపురం మునిసిపాలిటీలో విధులనుండి తొలగించిన 85 మంది మునిసిపల్ పారిశుద్ధ్య కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని గత 6 రోజులుగా సి.ఐ.టి.యు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు జరుగుతున్న రిలే నిరాహారదీక్షకు హిందూపురం జనసేన పార్టీ తరుపున సంపూర్ణ మద్దతు తెలియచేసి కరోన సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించిన కార్మికులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం భావ్యం కాదని, విధులనుండి తొలిగించబడిన 85 మంది పారిశుద్ధ్య కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకొని వారి ఉద్యోగాలను పర్మినెంట్ చేయవలసిందిగా జనసేన పార్టీ తరుపున డిమాండ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ తరుపున కార్మికులకు మధ్యాహ్నం భోజనం ఏర్పాటుచేసి, దీక్షాస్థలి ఖర్చుకు జనసేన పార్టీ హిందూపురం మండల అధ్యక్షుడు చక్రవర్తి 5 వేల రూపాయలు విరాళం అందించాడు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ హిందూపురం నియోజకవర్గ ఇంచార్జ్ ఆకుల ఉమేష్, జిల్లా అధికార ప్రతినిధి నిమ్మకాయల రాము, కార్మిక నాయకుడు ఎం ఎం మంజునాథ్, జిల్లా సంయుక్త కార్యదర్శి కొల్లకుంట శేఖర్, హిందూపురం మండల అధ్యక్షుడు చక్రవర్తి, జిల్లా కార్యనిర్వహణ కమిటీ సభ్యుడు నాగరాజు, జనసేన నాయకులు భాస్కర్, మారుతి తదితరులు పాల్గొన్నారు.