యూ1 రిజర్వడ్ జోన్ ను ఎత్తివేయాలని జనసేన డిమాండ్

మంగళగిరి, తాడేపల్లి మండల కుంచనపల్లి, కొలనుకొండ పరిధిలో ఉన్న (యూ1 రిజర్వడ్ జోన్) రైతులు తలపెట్టిన రిలే నిరాహార దీక్ష కు మద్దతుగా జనసేన పార్టీ చేనేత వికాస విభాగ చైర్మన్ మరియు మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ… అయ్యా రామకృష్ణారెడ్డి రాజకీయ కోణంలో ఆలోచించకుండా ఈ సామాన్య ప్రజలకు న్యాయం చేయాలని (యూ1 రిజర్వడ్ జోన్) ఎత్తివేయాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ చేనేత వికాస విభాగ చైర్మన్ మరియు మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు గారు, మరియు జనసేన పార్టీ రాష్ట్ర ఐటి విభాగం సభ్యులు చవ్వాకుల కోటేష్ బాబు, తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరావు(ఎస్.ఎన్.ఆర్), గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కోమలి, శెట్టి రామకృష్ణ, గంజి రమేష్ మున్నా శ్రీనివాస్, రాజారమేష్ వేణుదుర్గ షఫీ, నియోజకవర్గ పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలు మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు.