ఎన్ని రాజు ఆధ్వర్యంలో జనసేన డిజిటల్ క్యాంపెయిన్

రాజాం, ఆంధ్రప్రదేశ్ రోడ్లు దుస్థితి ప్రభుత్వంకి తెలిసే విధంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు #GoodMorningCMSir అనే కార్యక్రమాన్ని రాజాం నియోజకవర్గ జనసేన నాయకులు ఎన్ని రాజు ఆధ్వర్యంలో రాజాం, పార్వతీపురం రోడ్డు వంగర, మద్దివలస, మెట్ట మగ్గూరు గ్రామాలలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ విషయంపై ఎన్ని రాజు మాట్లాడుతూ పరిసర ప్రాంతాల ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు అనేక మంది ఇదే మార్గంలో ప్రయాణం చేస్తున్నారు అని.. ఎన్నో ఏళ్లుగా ఇదే పరిస్థితి ఉన్నా ఇప్పటి వరకు ప్రభుత్వం పట్టించుకోలేదు. స్థానిక శాసన సభ్యులు గాని, ఎంపీపీలు, జడ్పిటిసిలు అన్నీ వైఎస్ఆర్సిపి కైవసం చేసుకున్న రోడ్లు పరిస్థితి మాత్రం మారటం లేదని, ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాజాం నియోజకవర్గం ప్రజలు వైఎస్ఆర్సీపీకి గట్టిగా బుద్ధి చెబుతారని, ఇలా ఉంటే మిగతా నియోజకవర్గల పరిస్థితి ఏంటో అర్ధం అవుతుంది అని అన్నారు. ప్రజలకు కావలసింది వాహన మిత్ర పధకాలు కాదు, వాహనాలు వెళ్లే రోడ్లు అని ఎద్దేవా చేసారు. సీఎం జగన్ ఇప్పటికైనా మొద్దు నిద్రలో నుంచి బయటకు వచ్చి ఆంధ్రప్రదేశ్ రోడ్లు పరిస్థితి చూడాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన నాయకులు ఎన్ని రాజుతో పాటు అప్పలనాయుడు, గవరయ్య, వంగర మండల జనసైనికులు రమేష్, యోగి, శ్రీను, కార్యకర్తలు పాల్గొన్నారు.