జనసేనలో చేరిన శ్రీ చక్ర డైరీ అధినేత గరికపాటి శివ

నూజివీడు నియోజకవర్గం, ఆగిరిపల్లి మండలం, సురవరం గ్రామానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, శ్రీ చక్ర డైరీ అధినేత గరికపాటి శివ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసి తన ప్రయాణాన్ని కొనసాగించాలని జనసేన పార్టీలో చేరిన సందర్భంగా పార్టీకి 5 లక్షల విరాళం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా గరికపాటి శివకి జనసేన పార్టీ నూజివీడు మండలం వైస్ ప్రెసిడెంట్ ఇంటూరి చంటి జనసేన పార్టీలో చేరిన సందర్భంగా వారికి నూజివీడు జనసేన పార్టీ తరఫున హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నామని తెలిపారు.