అనారోగ్యంతో బాధపడుతున్న మణి కుటుంబానికి నెలకి సరిపడ నిత్యావసర సరుకులు అందజేసిన జనసేన

మర్రిపాడు మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో సూళ్లూరుపేట జనసేన పార్టీ వీరమహిళ శ్రీ గీతాంజలి దాతృత్వంతో మర్రిపాడు మండల పరిధిలోని పటమటనాయుపల్లి శ్ట్ కాలనీలో గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న మణి కుటుంబానికి నెలకి సరిపడ నిత్యావసర సరుకులు బియ్యం బస్తా మరియు 14 రకాలు నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మర్రిపాడు మండల నాయకులు చిన్నా జనసేన జిల్లా సంయుక్త కార్యదర్శి వనం పవన్ మండల ప్రచారకార్యదర్శి ఉదయ్, మణికంఠ, గంటా అంజి, స్థానికులు పాల్గొని విజయవంతం చేశారు.