దెందులూరు, కె.కన్నాపురంలో కదంతొక్కిన జనసేన

దెందులూరు నియోజకవర్గం, కె.కన్నాపురం గ్రామంలో శ్రీశ్రీశ్రీ గంగానమ్మ అమ్మవారి జాతర సంబరాలకు గ్రామస్తుల ఆహ్వానం మేరకు దెందులూరు జనసేన పార్టీ తరుపున పాల్గొన్న జనసేన నాయకులు కొఠారు ఆదిశేషు కి భారీ ర్యాలీతో స్వాగతం పలికిన జనసైనికులు. తమ ఊరి జాతరలో జనసేన పార్టీ తరుపున ప్రాతినిధ్యం కనిపించడం చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేసారు. దీనిని శుభ సూచికంగా భావిస్తున్నామని, ఇకనుండి పవన్ కళ్యాణ్ సిఎం అయ్యేవరకు నిదురపోమని కొఠారు ఆదిశేషు అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పూజారి వెంకటరత్నం నాయుడు, మట్టా రంగబాబు, తిరుపతి వాసు, కోలా నాగరాజు, ఏనుగు రామకృష్ణ, ఉజ్జు నాగరాజు, కన్నాపురం సాయి, ఉదయ్, తదితర జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.