Repalle: మున్సిపాలిటీ పరిధిలో రెండు వార్డులకు జనసేన నామినేషన్లు

• ఉపసంహరణ కోరుతూ వైసీపీ బెదిరింపులు
• నామినేషన్ దాఖలు సందర్భంగాను దౌర్జన్యానికి యత్నం
రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత జరుగుతున్న మున్సిపల్, స్థానిక ఎన్నికల్లో అధికార వైసీపీ దాష్టీకాలు కొనసాగుతున్నాయి. రేపల్లె మున్సిపాలిటీ నుంచి జనసేన పార్టీ తరఫున నామపత్రాలు దాఖలు చేసేందుకు వచ్చిన అభ్యర్ధులను పోలీసులు, రిటర్నింగ్ అధికారులు చూస్తుండగానే భయపెట్టే ప్రయత్నం చేశారు. తీవ్రంగా దుర్భాషలాడుతూ, నామినేషన్లు వేస్తే అంతు చూస్తామని బెదిరించారు. వైసీపీ ఒత్తిడులకు తలొగ్గకుండా 16వ వార్డు నుంచి శ్రీ కర్రా విజయ్ కుమార్, 8వ వార్డు నుంచి శ్రీ తోట నాగలక్ష్మిలు నామపత్రాలు దాఖలు చేశారు. ఈ ప్రక్రియ మొత్తం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జ్ శ్రీ కమతం సాంబశివరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీమతి కమతం విజయకుమారిలు దగ్గరుండి పర్యవేక్షించారు.