కార్యకర్త కుటుంబానికి జనసేన నాయకుల ఆర్థిక సహాయం
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమాను మండలం కొల్లిమర్ల గ్రామ బీసీ కుటుంబానికి చెందిన జనసేన కార్యకర్త చెన్నూరి మోహనదుర్గ నెల రోజుల క్రితం ప్రమాదం జరిగి అకస్మాత్తుగా చనిపోవడం జరిగినది. విషయం తెలుసుకున్న జనసేన నాయకులు అతని కుటుంబానికి ఏదైనా సహాయం చేయాలి అని జిల్లా కార్యదర్శి డేగల లక్ష్మణ్ స్పందించి 10,000/- రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగినది. ఈ సహాయన్ని కొడవటి సాంబశివరావు చేతులమీదుగా అందించడం జరిగినది.
ఈ సందర్భంగా గుంటూరు జిల్లా కార్యదర్శి డేగల లక్ష్మణ్ మాట్లాడుతూ ఈ కుటుంబానికి జనసేన పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుంది అని అధైర్యపడవద్దని తెలియచేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యలు యడ్ల వెంకటేశ్వరరావు, కాకుమాను మండల అధ్యక్షులు గడ్డం శ్రీనివాసరావు, మండల కమిటీ సభ్యులు సోమరౌతు శివనాగరాజు కొల్లిమర్ల గ్రామ అధ్యక్షుడు వట్టికూటి నాగార్జున, గ్రామ కమిటీ సభ్యులు తోట సీతారామయ్య, గ్రామ కమిటీ సభ్యులు చిల్లర భవానీ మరియు కొల్లిమర్ల జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-13-at-8.28.33-PM-1024x768.jpeg)