కామరాజుపేట గ్రామంలో జనం కోసం జనసేన

  • జనం కోసం జనసేన 604వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం: జనసేన నాయకులు పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర జగ్గంపేట నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనం కోసం జనసేన 604వ రోజు కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాసుల పంపిణీ కార్యక్రమం గోకవరం మండలం, కామరాజుపేట గ్రామంలో శుక్రవారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 200 గాజు గ్లాసులు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 1,02,260 గాజు గ్లాసులు పంపిణీ చేయడం జరిగింది. జనం కోసం జనసేన 605వ రోజు కార్యక్రమాన్ని మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 9:30 గంటల వరకు జగ్గంపేట మండలం జగ్గంపేట గ్రామంలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర తెలిపారు. శుక్రవారం కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జగ్గంపేట మండల అధ్యక్షులు మరిశే రామకృష్ణ, జగ్గంపేట మండల బిసి సెల్ అధ్యక్షులు రేచిపూడి వీరబాబు, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు తోలాటి ఆదినారాయణ, జగ్గంపేట మండల ప్రధాన కార్యదర్శి గండికోట వీరపాండు, కిర్లంపూడి మండల కార్యదర్శి ఎరుబండి పెద్దకాపు, కామరాజుపేట నుండి కరణం సూరిబాబు, జాజుల అశోక్, నీలం హరికృష్ణ, వెలిశెట్టి ప్రసాద్, బొర్రా కార్తీక్, కొత్తపల్లి నుండి మాధారపు ధర్మేంద్ర, వనం నరేష్, గోనేడ నుండి నల్లంసెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నాని, జానకి మంగరాజులకు పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర కృతజ్ఞతలు తెలిపారు.