నరసాపురంలో జనంకోసం జనసేన

ఆమదాలవలస నియోజకవర్గం, పొందూరు మండలం, నరసాపురం గ్రామంలో ఆమదాలవలస నియోజకవర్గ ఇంచార్జ్ పేడాడ రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ఇంంటికి వెళ్లి జనసేన పార్టీ సిద్దాంతాలు, షణ్ముఖ వ్యూహం, అధినేత కౌలు రైతులకి అండగా నిలబడే విధానం మరియు నియోజకవర్గంలో పార్టీ గెలిస్తే ప్రజల పక్షాన నిలబడి చేసే పనులు వివిధ అంశాలుతో కరపత్రం రూపంలో జనం కోసం జనసేన కార్యక్రమంతో వివరించి గ్రామంలో ప్రజలు ఎదుర్లొంటున్న సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు యలకల రమణ, బుడుమూరు లక్ష్మణ్, పిన్నింటి సురేష్, రమణ, గొర్లే వసంత్ కుమార్, జరజపు గణేష్, పొన్నాడ బాలు, లోట్టి సూరిబాబు, లోట్ల చైతన్య, చుళ్ళ రాంబాబు, దువ్వాడ సాగర్, హీమావరపు సింహాద్రి, మెండ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.