డా. గంగులయ్యను కలసిన జనసేన నాయకులు

రంపచోడవరం నియోజవర్గం: జనసేన పార్టీ నాయకులు కుర్ల రాజశేఖర్ రెడ్డి మరియు కొంతం శ్రీనివాస్ శనివారం పాడేరు రిసార్ట్ జనసేన పార్టీ అరుకు పార్లమెంట్ ఇంచార్జ్ డా. వంపూరు గంగులయ్య ను మర్యాదపూర్వకంగా కలసి శాలువా కప్పి సన్మానించడం జరిగింది. ఎప్పటికప్పుడు మాకు పార్టీ బలోపేతానికి చేయవలసిన కార్యక్రమాలు విధివిధానాలు తెలియజేస్తూ, ఏ ఒక్కరికి ఇబ్బంది వచ్చినా నేను తోడుగా ఉంటానని గంగులయ్య వివరించడం జరిగింది. ఈ సందర్భంగా కుర్ల రాజశేఖర్ రెడ్డి, కొంతం శ్రీనివాస్ గంగులయ్యకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.