జనం కోసం జనసేన – మహాపాదయాత్ర

  • జనసేన పార్టీ యువ నాయకురాలు శ్రీమతి తోట ప్రత్యూష దేవి ఆధ్వర్యంలో ఉత్సాహంగా కొనసాగిన మహాపాదయాత్ర
  • తోట ప్రత్యూష దేవి గారికి హారతులతో స్వాగతం పలికిన గ్రామ ప్రజలు
  • ముందుగా గ్రామంలో ఉన్న అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ అమ్మ వారి ఆశీస్సులు ఎల్లపుడూ ప్రజలపై ఉండాలని రాష్ట్రము సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు

రాజానగరం నియోజకవర్గం: రాజానగరం మండలం, దివాన్ చెరువు గ్రామం, బీజాపురి కాలనీలో జనం కోసం జనసేన మహాపాదయాత్రలో భాగంగా జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలతో కలిసి పాదయాత్రగా గ్రామంలో ప్రతీ ఇంటికీ, ప్రతీ గడపకూ వెళుతూ ప్రతీ ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ జనసేన పార్టీ సిద్దాంతాలను వివరిస్తూ జనసేన పార్టీ కరపత్రం, కీ చైన్, పోకెట్ బ్యాడ్జ్, బొట్టు బిల్ల ప్యాకెట్ అందజేసిన వీరమహిళ సమన్వయ కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి తోట ప్రత్యూష దేవి. వీరమహిళలు, జనసేన కార్యకర్తలు, యువత తండోపతండాలుగా స్వచ్ఛందంగా ఈ మహాపాదయాత్రలో పాల్గొన్నారు.