మహల్లా మసీదులో జనసేన పండ్ల పంపిణీ కార్యక్రమం

ఏలూరు నియోజకవర్గంలోని 44వ డివిజన్ గన్ బజార్ పెన్షన్ మొహల్లా మసీదులో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లిం సోదరులకు ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు ఆధ్వర్యంలో ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ పవిత్రమైన రంజాన్ నెలలో కఠోరమైన దీక్షలు చేస్తున్న ముస్లిం సోదర సోదరీమణులకు ఫ్రూట్స్ పంపిణీ చేయడం మాకెంతో ఆనందం కలిగించిందన్నారు. ఆ అల్లా దీవెనలు ఆంధ్రరాష్ట్ర ప్రజలకు, ఏలూరు నియోజకవర్గ ప్రజలకు, జనసేన పార్టీ నాయకులపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసారు.ఇ ఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ శిరిపల్లి ప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షులు ఇళ్ళ శ్రీనివాస్, నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, అధికార ప్రతినిధి అల్లు సాయి చరణ్, కార్యదర్శులు కందుకూరి ఈశ్వరరావు, ఎట్రించి ధర్మేంద్ర, బొత్స మధు, నాయకులు బోండా రాము నాయుడు, రెడ్డి గౌరీ శంకర్, వేములబాలు, నిమ్మల, శ్రీనివాసరావు, అగ్గాల శ్రీనివాస్, పసుపులేటి దినేష్, మడుగుల మాణిక్యాలరావు, స్థానిక 44 వ డివిజన్ ఇంచార్జీ జనపరెడ్డి తేజ ప్రవీణ్, చిరంజీవి, ఆనంద్, ముస్లిం సోదరులు షేక్ మస్తాన్, షేక్ ఈసూబ్, షేక్ నాగూర్, షేక్ అబ్దుల్, పఠాన్ రసూల్, షేక్అల్లాబక్షు, షేక్కరిముల్లాషేక్ పండు, పఠాన్ షాకీర్ తదితరులు పాల్గొన్నారు.