మేకల ఏడుకొండలుకు మనోధైర్యాన్నిచ్చిన జనసేన

ఎన్టీఆర్ కృష్ణా జిల్లా, తిరువూరు నియోజకవర్గం, విస్సన్నపేట మండలం, రాజీవ్ నగర్ కాలనీకి చెందిన జనసైనికుడు అనారోగ్యంతో ఉన్నాడనే స్థానిక జనసైనికుల సమాచారంతో విస్సన్నపేట జనసేన పార్టీ మండల అధ్యక్షులు షేక్ యాసిన్ అధ్యక్షతన ఎన్టీఆర్ జిల్లా మరియు కృష్ణ జిల్లాల జనసేన పార్టీ వైస్ ప్రెసిడెంట్ బొలియశెట్టి శ్రీకాంత్ ఆదివారం ఉదయం రాజీవ్ నగర్ చేరుకొని జనసైనికులతో కలసి బాధిత కుటుంబానికి మేము ఉన్నాము అని బరోసా కల్పించి దైర్యంతో పాటు ఆర్థిక సహకారాన్ని అందించటం జరిగినది. అంతేకాక కుమార్తె వివాహానికి కూడా పార్టీ తరపున జనసైనికుల సహకారం ఉంటుందని ఇంచు మించు 50 వేల పై మాటగా ఏర్పాటు చేస్తామని జిల్లా వైస్ ప్రెసిడెంట్ బొలియశెట్టి శ్రీకాంత్ ఈ సందర్భముగా మాట ఇవ్వటం జరిగినది. ఇలా పార్టీ నన్ను గుర్తించి ఇంటికి వచ్చి నాకు అన్ని రకాలుగా ఆదుకుంటున్న జనసేన పార్టీకి జీవితాంతం ఋణపడి ఉంటాము అని ఆ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేసారు. వివరాలలోకి వెళితే విస్సన్నపేట మండలంలోని రాజీవ్నగర్ కాలనీలో నివాసం ఉంటున్న మేకల ఏడుకొండలు గత కొద్ది కాలం నుండి బ్రెయిన్ కు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారు, ఈ విషయం ఆలస్యంగా జనసేన పార్టీ శ్రేణులకు సమాచారం అందటంతో వెంటనే మండల అధ్యక్షులు షేక్ యాసిన్ పైస్థాయి నాయకులతో కలసి వివరించగా యుద్ద ప్రాతిపదికన కలసి కట్టుగా వారిని పరామర్శించి జనసేన పార్టీ తరఫున వారికి ఆర్థిక సహాయం అందించటం గొప్ప విషయంగా స్థానికులు చర్చించుకుంటున్నారు, ప్రస్తుత పాలకులు వచ్చామా వెళ్ళామా అనేలా ఉన్నారని, జనసేన అలా కాదు అని ప్రజలు తమ అభిప్రాయాలు చెప్పకుంటున్నారు. అనంతరం స్థానిక విస్సన్నపేట పట్టణానికి సంబంధించి డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలని పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. అనంతరం జనసేన పార్టీ సైనికుడు బిల్లా నారాయణ పాప అన్నప్రాసన కార్యక్రమానికి పుట్రాల గ్రామంలోని మారెమ్మ తల్లి గుడికి వెళ్లి చిన్నారికి ఆశ్శీసులు అందించి విందులో పాల్గొనటం జరిగినది. ఈ సందర్భముగా త్వరలో మండలంలో భారీ చేరికలు ఉంటాయి అని దానికి ఏర్పాటు చేస్తున్నట్లు యాసిన్ సూచన ప్రాయంగా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.