మన్నూరులో జనంలో జనసేన

ఉమ్మడి కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం రాజంపేట మండలంలో జనంలో జనసేన కార్యక్రమం మన్నూరులో జనసేన నాయకులు యల్లటూరు శ్రీనివాసరాజు ఆదేశాల మేరకు జనసేన నాయకులు జనసైనికులు ఇంటింటికి ప్రచారం చేసి పవన్ కళ్యాణ్ ఆశయాలను, జనసేన పార్టీ సిద్దాంతాలను ఎన్నికల గుర్తు గాజు గ్లాస్ ను వివరించి కరపత్రాలను పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజలు ఎదురుకుంటున్న సమస్యలను సేకరించి రానున్న ఉమ్మడి ప్రభుత్వంలో జనసేన పార్టీ ద్వారా పరిష్కారం చూపుతామని జనసేన నాయకులు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాజంపేట జనసేన నాయకులు పత్తి నారాయణ, నారదాసు రామచంద్ర, ఆకుల చలపతి, హరి, శంకర్ రాజు, సుబ్రమణ్యం రాజు, రాజేష్ వర్మ, సుబ్బయ్య, వెంకటేషు, నారాయణ, సతీష్, భరత్, తేజ, పెంచలయ్య, మారుతి, చిన్న ఓబులేసు, కుమార్, వీరమహిళలు సుజాత, హేమ, సావిత్రి, సుప్రియ, జయంతి, రత్నమ్న, మీనాక్షి, సుబ్బలక్ష్మి, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.