ప్రజల కష్టాలను తీర్చేందుకు జనసేన ఎప్పుడూ ముందుంటుంది: గొంది మురళి

జి.మాడుగుల జనసేన పార్టీ మండల ప్రధాన కార్యదర్శి గొంది మురళి మాట్లాడుతూ అధికార పార్టీ ప్రజల కష్టాలను పట్టించుకోకుండా వారిని ఇబ్బంది పెట్టడం చాలా బాధాకరం అన్నారు. అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు గడిచిన ఎలాంటి రహదారులు పనులు చేపట్టలేదని ఆయన అన్నారు. అధికార పార్టీ వైఫల్యాలను ప్రజలు చూస్తున్నారని రాబోయే ఎన్నికల్లో వారికి సరైన గుణపాఠం చెప్తారని చెప్పారు. ప్రజల కష్టాలను తీర్చేందుకు జనసేన పార్టీ ఎప్పుడూ ముందుంటుందని ఏ సమస్య వచ్చినా జనసేన పార్టీ అండగా ఉంటుందని ఆయన తెలిపారు రాబోయే 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ అధికారంలోకి వస్తుందని అప్పుడు ప్రజల కష్టాలు తీరుతాయని ఆయన తెలిపారు. జనసేన పార్టీ యూత్ అధ్యక్షులు మస్తాన్ మాట్లాడుతూ జనసేన పార్టీ ప్రధాన ఎజెండా ప్రజల సమస్యలపై పోరాడటమేనని అందుకు ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా బెదిరించినా పోరాటం ఆపేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు జనసేన పార్టీ ప్రజలకు అండగా ఉంటుందని తెలిపారు సూరి మెట్ట గ్రామస్తులు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారని గతంలో ఎవరూ చేయలేని పనిని జనసేన పార్టీ చేసి చూపించిందని ఎంతో సంతోషంగా భావిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జి.మాడుగుల జనసేన పార్టీ మండల అధ్యక్షులు మసాడి భీమన్న, ప్రధాన కార్యదర్శి గొంది మురళి, యూత్ అధ్యక్షులు మస్తాన్, గౌరవ అధ్యక్షులు తెరవాడ వెంకటరమణ, యూత్ ఉపాధ్యక్షులు వంతల పవన్ కళ్యాణ్, సీనియర్ జనసైనికులు వంతల అరుణ్ కుమార్, సూర్యపేట గ్రామస్తులు పాల్గొన్నారు.