ఆర్ధిక సాయంతొ అభయమిచ్చిన జనసేన నాయకులు అనుకుల రమేష్

జనసైనికునికి ఏ ఆపద కలిగినా అండగా ముందుగా నేనుంటా నంటున్నారు తణుకు జనసేన నాయకులు అనుకుల రమేష్. వై ఎస్ ఆర్ సి పి నాయకుల దాడిలో తీవ్రంగా గాయపడిన తణుకు ఏడవ వార్డు ఇందిరమ్మ కాలనీ కి చెందిన పిల్లాడి పూర్ణ రామారావు కుటుంబాన్ని బుధవారం పరామర్శించి జనసేన పార్టీ తరపున భరోసా ఇచ్చారు… జిల్లా వ్యాప్తంగా జనసేన శ్రేణులంతా కలసి 47500 రూపాయలు రామారావు వైద్య నిమిత్తం బాధిత కుటుంబానికి అనుకుల రమేష్ అందజేశారు. ఈ సందర్భంగా రామారావు కుటుంబ సభ్యులు జనసేన అధినేత కు, జనసైనికులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కానూరి మాధవ రాయుడు, ముత్యాల శివ రామకృష్ణ, అడబాల మణికంఠ, ఆవాల సాయి, భూపతిరాజు విజయకుమార్ రాజు, తామరపల్లి సాయి, నెయ్యల శివ తదితరులు పాల్గొన్నారు.