Pithapuram: జనసైనికుడి కుటుంబానికి మనోధైర్యాన్నిచ్చిన శ్రీమతి మాకినీడి శేషుకుమారి

పిఠాపురం మండలం కోలంక గ్రామంలో ఇటీవల మరణించిన జనసైనికుడు శ్రీపతి అప్పారావు(27) వారి కుటుంబ సభ్యులను జనసేనపార్టీ ఇంచార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి పరామర్శించి వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ఇచ్చి కుటుంబానికి ఎప్పుడూ అండగా ఉంటానని తెలియజేశారు. వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం రూరల్ కమిటీ ప్రధాన కార్యదర్శి అడపా శివరామకృష్ణ, ఉపాధ్యక్షులు వాకపల్లి సూర్య ప్రకాష్, కొండపల్లి శివ, కోలంక ఎంపీటీసీ అభ్యర్థి కేతినిడి గౌరీ నాగలక్ష్మి, కర్రిరెడ్ల రాజు, నంద్యాల నాగబాబు, కేతినిడి అర్జున్న, గణేష్ల చిట్టిబాబు, దేశెట్టి బుజ్జి, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.