వైసీపి నాయకులపై జగ్గంపేట పోలీస్ స్టేషన్ లో జనసేన నాయకుల పిర్యాదు

జగ్గంపేట: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరియు వారి కుటుంబ సభ్యులపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న వ్యక్తిగత విమర్శలను జగ్గంపేట మండల జనసేన సైనికులంతా ముక్తకంఠంతో ఖండించారు. అలాగే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై జగ్గంపేట పోలీస్ స్టేషన్ లో సబ్ ఇన్ స్పెక్టర్ విద్యాసాగర్ కు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి బుదిరెడ్డి శ్రీనివాస్, మండలాధ్యక్షులు మరిసే రామకృష్ణ మాట్లాడుతూ.. ఈ ప్రభ్రుత్వానికి ప్రజా సేవ చేయడం చేతకాక ప్రజా సమస్యలు తెలుసుకుంటున్న పవన్ కళ్యాణ్ ని రాజకీయపరంగా ఎదిరించే దమ్ము ధైర్యం లేక పవన్ కళ్యాణ్ ప్రజలలో తిరిగితే వీళ్ళ తప్పులు బయటకు లాగుతున్నాడని భయంతో ఇలాంటి వ్యక్తిగత మరియు కుటుంబ సభ్యులపై అసభ్యకర వాక్యలుచేస్తూ, లేనిపోవి ఆరోపణలు చేస్తూ వాటిని ప్రసారం చేసి మీ నీచ ప్రవర్తిని బయట పెడుతున్నారు. వైసీపీ నాయకులే కాకుండా వైయస్సార్ పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అదే ధోరణిలో వెళ్తున్నారు. అమ్మ ఒడి కార్యక్రమంలో చిన్నారులు ఎదుట పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేస్తూ అసభ్యకర పదజాలాలు ప్రయోగిస్తూ ప్రసంగం కొనసాగించారన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు పాలిశెట్టి సతీష్, మండల మహిళా అధ్యక్షురాలు లంకపల్లి భవాని, మండల యువత అధ్యక్షులు మొగలి గంగాధర్, మండల ఉపాద్యక్షులు తోలాటి ఆదినారాయణ, జట్ల వీరభద్ర, తుమ్మల పనింద్ర, మనోజ్, మరిసే శ్రీనివాస్, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.