మెలియాపుట్టి మండలంలో అగ్ని ప్రమాదానికి గురైన ధాన్యం కుప్పలను పరిశీలించిన జనసేన నాయకులు

పాతపట్నం, మెలియాపుట్టి మండలములోని పడ్డ గ్రామములో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదానికి గురైన వరి ధాన్యము కుప్పలను పరిశీలించిన జనసేన నాయకులు. అక్కడ రైతులు లబ్బ బిసై, దొంబురు దొలై, బాలించి దొలైలతో మాట్లాడుతూ ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఎంత మేరకు నష్టం వాటిల్లిందని రైతులను అడిగి తెలుసుకున్నారు. పంట నష్టం ముగ్గురు రైతులు కలుపుకొని ఐదు ఎకరాల వరకు నష్టపోయామని రైతులు లబోదిబోమంటున్నారు. మండల వ్యవసాయ అధికారులు మరియు రెవెన్యూ ఉన్నతాధికారులు రైతులకు త్వరితగతిన నష్టపరిహారం అందించాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరిగింది.