బల్లె లక్ష్మీ నాగ శివ కుమారికి నివాళులర్పించిన జనసేన నాయకులు

పోలవరం, కొయ్యలగూడెం మండలంలో గత కొన్ని రోజుల క్రితం జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో జనసేన పార్టీకోసం తన వంతుగా ఎంతో కృషి చేస్తున్న క్రియాశీలక సభ్యులు దాకారపు మధు సోదరి బల్లె వెంకటరమణ భార్య బల్లె లక్ష్మీ నాగ శివ కుమారి మరణించడం జరిగింది. ఇందుకుగాను గురువారం కొయ్యలగూడెం మండలం దిబ్బకాయలపాడు గ్రామంలో వారి నివాసమందు మండల అధ్యక్షులు తోట రవి ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి, జిల్లా కార్యదర్శి గడ్డమణుగు రవికుమార్, పోలవరం నియోజకవర్గం ఇన్చార్జి చిర్రి బాలరాజు వారి కుటుంబాన్ని పరామర్శించారు. వారి కుటుంబానికి కలిగిన నష్టం తీరనిలోటని, వారికి జనసేన పార్టీ ఎల్లప్పుడూ ఆదుకుంటుందని, ధైర్యంగా ఉండాలని జనసేన పార్టీ మీకు భరోసాగా ఉంటుందని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలోజిల్లా సంయుక్త కార్యదర్శి పాదం కృష్ణ, కొయ్యలగూడెం టౌన్ అధ్యక్షులు మాదేపల్లి శ్రీను, పోలవరం మండలం అధ్యక్షులు గుణపర్తి వెంకట సత్యనారాయణ, అప్పన ప్రసాద్, నియోజకవర్గ ముఖ్య నాయకులు మండల కమిటీ నాయకులు, గ్రామ కమిటీ నాయకులు, కార్యకర్తలు వీర మహిళలు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.