అంబేద్కర్ కు జనసేన నేతల ఘన నివాళులు

కోనసీమ జిల్లా, భారత రాజ్యాంగ నిర్మాత, బలహీన వర్గాల వికాసానికి పాటుపడిన మహానేత, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో అమలాపురం పట్టణం పలు వార్డుల్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన జనసేన నాయకులు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి చిక్కాల సతీష్, ఆకుల బుజ్జి, పిండి రాజా, గొలకోటి విజయలక్ష్మీ, గండి స్వామి, గుమ్మళ్ళ తాతయ్య కాపు, అర్లపల్లి దుర్గ, కారెం వెంకట్రావు, లింగోలు కృష్ణ, నాగిరెడ్డి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.