విశ్వనాధ్ ను పరామర్శించిన జనసేన నాయకులు

మదనపల్లి: రామసముద్రం మండల జనసేన ఉపాధ్యక్షులు చాకలి విశ్వనాధ్ కు శస్త్ర చికిత్స చేసుకొన్న కారణంగా ఆయనని జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి ఆధ్వర్యంలో పరామర్శించిన జనసేన నాయకులు కార్యకర్తలు వీరమహిళలు. ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకొన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం, జిల్లా జాయింట్ సెక్రటరీ సనా ఉల్లా, మదనపల్లి పట్టణ అధ్యక్షులు నాయని జగదీష్, రామసముద్రం మండల అధ్యక్షులు చంద్రశేఖర్, రెడ్డెమ్మ, క్రాంతి బంగారం, జైరాజ్, చంద్రశేఖర, లవన్న, జనర్దన్, నవాజ్, సత్య జనసేనికులు తదితరులు పాల్గొన్నారు.