జనసైనికుని కుటుంబానికి అండగా నిలిచిన జనసేన నాయకులు

రామగుండం నియోజకవర్గం: జనసైనికుడు సతీష్ గత రెండు సంవత్సరాలుగా కాన్సర్ తో పోరాడి ఆగష్టు 31వ తేదీన స్వర్గీయులవడం జరిగింది. మంగళవారం జనసైనికుడు కొసరి సతీష్ జనసేన పార్టీ క్రియశీలక సభ్యత్వ కిట్టును మరియు జనసేన పార్టీ నాయకులు స్వచ్చందంగా ఇచ్చిన 25 వేల రూపాయలును ఉమ్మడి కరీంనగర్ జిల్లా యువజన ఆధ్యక్షలు రావుల మధు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకులు రావుల సాయికృష్ణ, రామగుండం నియోజకవర్గం వీరమహిళా నాయకురాలు కనిగంటి మంగ వారి చేతుల మీదుగా కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది. ఈ సందర్బంగా రావుల మధు మాట్లాడుతూ ఒక జనసైనికుడిని కోల్పోవడం బాధాకరం, జనసైనికుని కుటుంబానికి అండగా జనసేన పార్టీ ఉంటుందని భరోసా తెలుపుతూ జనసేన పార్టీ నాయకులు స్వచ్చందంగా ఇచ్చిన 25 వేల రూపాయలు వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది. ఇంకా ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఈ నిరుపేద కుటుంబంను ఆదుకోవాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం నాయకులు రవి కాంత్, రంజిత్, వంశీ, సురేష్, అజయ్, నరేష్ పాల్గొన్నారు.