తన్నీరు గోపీనాథ్ ను పరామర్శించిన జనసేన నాయకులు

జగ్గయ్యపేట నియోజకవర్గం, పెనుగంచిప్రోలు మండల ఉపాధ్యక్షుడు తన్నీరు గోపీనాథ్ గురువారం రాత్రి మైలవరం నుండి పెనుగంచిప్రోలు వస్తుండగా మార్గ మధ్యలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణాజిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ, ఉపాధ్యక్షులు బొలియశెట్టి శ్రీకాంత్, జిల్లా కార్యదర్శిలు రవి, సురేష్, పెనుగంచిప్రోలు మండల అధ్యక్షులు శివ, విజయవాడలోని ఆంధ్ర హాస్పిటల్ కు వచ్చి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకొని, వారి తల్లిదండ్రులతో మాట్లాడి ధైర్యం చెప్పి పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని తెలియజేయడం జరిగింది.