దివాన్ చెరువులో 2వ రోజు ఉదృతంగా జనంకోసం జనసేన మహాపాదయాత్ర

  • ప్రణాళికాబద్ధమైన సుస్థిర అభివృద్ధి జనసేన పార్టీతోనే సాధ్యం

రాజానగరం “జనంకోసం జనసేన – మహాపాదయాత్ర” కార్యక్రమం, రాజానగరం మండలం, దివాన్ చెరువు గ్రామంలో గ్రామ ప్రజల ఆదరాభిమానాలతో ఉత్సాహంగా, రాత్రిపూట సైతం సుదీర్ఘంగా కొనసాగింది, జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో, వీరమహిళలు జనసైనికుల నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రతి గడప, ప్రతి ఇంటికి వెళ్లి, ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ, ఈసారి జనసేన పార్టీకి ఓటు వేసి పవన్ కళ్యాణ్ ని ఆశీర్వదించాలని అభ్యర్థిస్తూ కరపత్రాలు పంచుతూ ఉత్సాహంగా ఈ కార్యక్రమం ముందుకు కొనసాగింది. ఈ సందర్భంగా బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ ఈసారి నియోజకవర్గం ఏ గ్రామంలో చూసినా ప్రజలందరూ ముక్తకంఠంతో ఈసారి జనసేన పార్టీకి అవకాశం ఇచ్చి పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలపరచడానికి ముందుకు రావడం రాష్ట్రానికి శుభసూచకమని ఈ అసమర్థత ముఖ్యమంత్రి పాలన ఎంత తొందరగా పోతే రాష్ట్రానికి అంత మంచిదని ఈరోజు రాష్ట్రంలో చాలా దారుణమైన దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని, ఇచ్చిన మాట ఒక్కటి కూడా నిలబెట్టుకోకుండా ప్రగల్బాలు పలుకుతున్న ఈ ముఖ్యమంత్రికి గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఈ సమయంలో ప్రజలందరూ జనసేన పార్టీకి అవకాశం ఇచ్చి ప్రజల శ్రేయస్సు కాంక్షించే ప్రజా నాయకుడు పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలపరిచి తద్వారా ప్రజా పరిపాలన తీసుకొద్దామని, మహా పాదయాత్రకు సహకరిస్తున్న వీరమహిళలకు, జనసైనికులకు, నాయకులకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను” అన్నారు. ఈ మహాపాదయాత్రలో దివాన్ చెరువు గ్రామ జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.