జియమ్మవలసలో జనసేన మండల స్థాయి ఆత్మీయ సమావేశం

కురుపాం నియోజకవర్గం, జియమ్మవలస మండలంలో జనసేన మండల స్థాయి ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశాన్ని జియమ్మ వలస మండలానికి చెందిన విజయనగరం జిల్లా కార్యనిర్వాహణ కమిటీ కార్యదర్శి పెంట శంకరరావు, నియోజకవర్గం ఐటీ వింగ్ సభ్యులు లచ్చిపతుల రంజిత్ కుమార్, మండల నాయకులు వావులపల్లి రాజేష్, వారణాసి శివకుమార్, రంబ రమేష్, దాసరి శ్రీను, గలావళ్లి శ్రీను, చెవిటి సాయిరామ్, గుణుపూర్ పోలినాయుడు, రవి, శశి బాధ్యతలు తీసుకుని ముందుండి నడిపించరు. ఈ సమావేసనికి విజయనగరం జిల్లా కార్యనిర్వాహణ కార్యదర్శులు వాన ఉపేంద్ర, గార గౌరీ శంకర్రావు, కొమరాడ మండల అధ్యక్షులు తెంటు శ్రీఖర్, నియోజకవర్గం నాయకులు కిల్లాన్ అనంత్ కుమార్, ముఖ్య అతిథులుగా హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి.. అనంతరం ఈ సమావేశంలో మాట్లాడుతూ గ్రామస్థాయి, మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు పార్టీని బలోపేతం చేస్తూ శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారిని వచ్చే ఎన్నికల్లో గెలిపించుకొని ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేయాలని మనం అందరం కూడా చాలా కష్టపడి ప్రతి గ్రామంలో మార్పు తీసుకొచ్చే విధంగా కష్టపడాలి, అలాగే జనసేన పార్టీ కోసం కష్టపడే ప్రతి వ్యక్తికి పార్టీ గుర్తిస్తుంది. ఏ కష్టం వచ్చినా పార్టీ అందగా నిలబడుతుంది అని తెలియజేయడం జరిగింది. అనంతరం ఈ కార్యక్రమాల్లో నూతన సంవత్సర క్యాలెండర్ లను ఆవిష్కరణ చేయడం జరిగింది. ఇకపై జనసేన పార్టీని ప్రతి గ్రామానికి పరిచయం చేసే విధంగా ప్రతి ఒక్కరు బాధ్యతలు తీసుకోవాలని అలాగే, మండల పరిధిలో చుట్టుపక్కల జనసేన పార్టీ కోసం ప్రతి ఒక్క జనసైనికుడు కూడా బాధ్యత తీసుకుంటామని ఈ కార్యక్రమంలో తెలియజేయడం జరిగింది. మండల పరిధిలో ఉన్న చుట్టుపక్కల గ్రామ జనసైనికులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.