పెరిగిన విద్యుత్ చార్జీలకు నిరసనగా జనసేన భారీ ర్యాలీ

నిడదవోలు, పెరిగిన విద్యుత్ చార్జీలకు నిరసనగా శుక్రవారం సాయంత్రం 7 గంటలకు నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం ఉండ్రాజవరం గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రియ సౌజన్య, మరియు ఉంద్రాజవరం మండల అధ్యక్షులు వీరమళ్ళ బాలాజీ మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు పాలా వీరస్వామి, సాదా వెంకట్, కాకర్ల నాని, ఏ.ఎన్.ఆర్, కర్రి వినోద్ కుమార్, మూర్తి, పిప్పర రవి,ఇంటి వెంకట్, కానూరు ఎంపిటిసి సీతయ్య నాయుడు, సావరం ఎంపిటిసి కాకర్ల కరుణ, గరిమెళ్ళ కొండలరావు, జవ్వాది వినయ్, మండల నాయకులు, ఉండ్రాజవరం జనసైనికులు పాల్గొన్నారు.