జనసేన ముస్లిమ్ సచార్ యాత్ర

కాకినాడ సిటీ: జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు కాకినాడ సిటీ ఇన్ ఛార్జ్ ముత్తా శశిధర్ ఆలోచనలతో జనసేన ముస్లిమ్ సచార్ యాత్ర డాక్టర్ బాబు ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా ముస్లిం ప్రజలతో డాక్టర్ బాబు కలిసి వారి ఆలోచనలను పంచుకున్నారు. వారికి ఈ వై.సి.పి ప్రభుత్వం నుండీ ఏవైనా సంక్షేమ పధకాల ఫలాలు అందుకున్నామా లేదా అని ఆరాతీసారు. తదనంతరం ఆయన మాట్లాడుతూ ముస్లిం ప్రజలలో మెజారిటీ ప్రజలు అత్యంత పేదరికంలో బతుకుతున్నారన్నారు. ఈ వై.సి.పి ప్రభుత్వం ఎన్నికలకు ముందర చెప్పలేనంత ప్రేమని ఒలకబోసి తీరా అధికారంలోకి వచ్చాకా పట్టించుకున్న పాపానపోలేదన్నారు. ఈ నాలుగున్నర ఏళ్ళ కాలంలో వై.సి.పి ప్రభుత్వానికి ముస్లింలు కనపడలేదనీ నేడు ఎన్నికలొస్తున్నాయని కపట ప్రేమని కనబరుస్తున్నారని గమనించాలన్నారు. జనసేన పార్టీ ముస్లింలకు ఎప్పుడు కష్టమొచ్చిన ముందు ఉండి పోరాటం చేస్తోందని గుర్తుచేసారు వచ్చే ఎన్నికలలో ఈ వై.సి.పి ప్రభుత్వానికి తమ సత్తా చూపించాలని ముస్లింలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ మొయినుద్దీన్, షేక్ ఇమాం, షేక్ భాషా, ఎండి. హబీబుల్లా, సయ్యద్ బాజీ తదితరులు పాల్గొన్నారు.