అంగరంగ వైభవంగా జనసేన కార్యాలయం ప్రారంభం

  • జనసేన, టీడీపీ, బీజేపీ అభ్యర్థిని గెలుపుంచుకొని తీరతాం అని తెలియచేసిన జనసేన పార్టీ పీఏసీ మెంబెర్, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరిప్రసాద్
  • తిరుపతిలో జనసేన ప్రభంజనం సృష్టిస్తాం

తిరుపతి నియోజకవర్గం: జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అరణి శ్రీనివాసులు జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. జనసేన, తెలుగుదేశం, బీజేపీ సంయుక్తంగా కలిసి వైసీపీని ఇంటికి పంపుతుందని తెలియచేసారు. ప్రస్తుత రాజకీయ పార్టీలు ప్రజా జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తున్న విధానాన్ని చూసి ప్రజల కష్టాలను తీర్చేవారు ఎవరు లేకుండాపోయారు. అలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి రాష్ట్ర ప్రజలకు ఎన్నో గొప్ప పనులు చేసారు. అలాంటి వారికి అధికారం ఇస్తే ఇంకెన్ని చెస్తారో ఆలోచించాలి అని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో హరిప్రసాద్ మాట్లాడుతూ.. జగన్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యేలు చేస్తున్న అరాచకాలు అన్ని ప్రజలు తెలుసుకున్నారు ఈసారి జగన్ రెడ్డికి తగిన బుద్ది చెప్తారు. రాష్ట్ర ప్రజలకు మంచి భవిష్యత్తును ఇవ్వటమే పవన్ కళ్యాణ్ గారి లక్యం అని తెలియచేసారు. నిస్వార్థంగా పని చేసే ప్రతి ఒక్క కార్యకర్తకి మంచి భవిష్యత్ ఉంటుంది. 2024 లో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడటమే మన లక్ష్యం అని తెలియచేసిన డా. పసుపులేటి హరిప్రసాద్. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ నాయకులు జనసేన తిరుపతి కమిటీ నాయకులు, వార్డ్ కమిటీ, బూత్ కమిటీ నాయకులు పాల్గొన్నారు.