యర్రబాలెంలో ఘనంగా జనసేనపార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

మంగళగిరి, జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు సూచనల మేరకు జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా యర్రబాలెం జనసేన పార్టీ అధ్యక్షులు లేళ్ళ సాయి నందన్ ఆధ్వర్యంలో గ్రామంలోని 60 మందికి పైగా పదవ తరగతి విద్యార్థిని, విద్యార్థులకు ఎద్జాం కిట్లను (ప్యాడ్, పెన్స్, స్కేల్, పెన్సిల్, ఏరెసర్, షర్ప్నర్) పంపిణీ చేసి, కేక్ కట్ చేయడం జరిగింది. నాయకులు వారి అనుభవాలను పంచుకొని,మీరు ఉన్నత స్థాయిలో ఉండాలని ఆశీర్వదించి ఈ పరీక్షలలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు రాబోయే రోజుల్లో బహుమతులు అందచేస్తాం అని తెలిపి విద్యార్థులందరికీ ఆల్ ద బెస్ట్ తెలియచేసారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర మహిళ ప్రధానకార్యదర్శి ఆకుల జయసత్య, జనసేన మండల కార్యదర్సులు శిక నీలంబరం, కోలా భాగ్యరావు, గ్రామ ఉపాధ్యక్షులు పూర్ణ, కమిటీ సభ్యులు ఆళ్ల రాంబాబు, ఉయ్యాల రోశయ్య, గ్రామ మహిళ కోఆర్డినేటర్ దులిపూడి పావణి, బండారు రాజేశ్వరి, టీడీపీ గ్రామ అధ్యక్షులు నీలం అంకారావు, కానుకోలను సుబ్బారావు, జనసైనికులు పలగని సాయి, మండేలా వెంకటేష్, మక్కె పవన్ కళ్యాణ్, బండారు చైతన్య, రపాక సుమంత్, చిన్నూ, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.