జనసేన పార్టీ ముఖ్యనేతలు సమావేశం

కళ్యాణదుర్గం నియోజకవర్గం: జనసేన పార్టీ ఇంచార్జ్ బాల్యం రాజేష్ ఆధ్వర్యంలో టిడిపి ముఖ్య నేతల ఆహ్వానం మేరకు కళ్యాణదుర్గం నియోజకవర్గం జనసేన-టిడిపి ఉమ్మడి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు తనయుడు యశ్వంత్ చౌదరి మరియు సురేంద్ర బాబు గారి అల్లుడు ధర్మతేజ ఇద్దరితో జనసేన పార్టీ ముఖ్యనేతలు సమావేశం కావడం జరిగింది. ఈ సమావేశంలో ఉమ్మడి ప్రచారం, భవిష్యత్తు కార్యాచరణ, లోకల్ మేనిఫెస్టో అంశాలు గురించి విస్తృతంగా చర్చించడం జరిగింది. ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షులు వంశీకృష్ణ, నియోజకవర్గం స్పోక్ పర్సన్&మైనారిటీ హెడ్ సయ్యద్, నియోజకవర్గ వీరమహిళలు షేక్ తార, మమత, కళ్యాణదుర్గం మండల అధ్యక్షులు జాకీర్ హుస్సేన్, బ్రహ్మసముద్రం మండల అధ్యక్షులు ఆంజనేయులు, కుందుర్పి మండల అధ్యక్షులు జయకృష్ణ, శెట్టూరు మండల అధ్యక్షులు కాంత్ రాజ్, కళ్యాణదుర్గం నియోజకవర్గం సోషల్ మీడియా కోఆర్డినేటర్ రాయుడు, కళ్యాణదుర్గం మండల ఉపాధ్యక్షులు శ్రీనివాసులు, శెట్టూరు మండల ఉపాధ్యక్షులు రామలింగ, కంబదూరు మండల ఉపాధ్యక్షులు శ్రీనివాస్, కుందుర్పి మండల కార్యదర్శి ఓబులరాజు, కళ్యాణదుర్గం మండల కమిటీ సభ్యులు అనిల్, కార్తీక్, కళ్యాణదుర్గం నాయకులు సుధాకర్, చిత్తప్ప పాల్గొన్నారు.