“బత్తుల” ఆధ్వర్యంలో భారీగా జనసేన పార్టీలో చేరిక

  • రఘునాధపురం గ్రామంలో వైఎస్ఆర్సిపికి బిగ్ షాక్
  • బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో నిత్యం వైసిపి నుండి ఉదృతంగా జనసేన పార్టీలోకి కొనసాగుతున్న చేరికలు
  • రాజానగరం మండలంలో తుడిచిపెట్టుకుపోతున్న వైసిపి
  • మారాల్సిన సమయం ఆసన్నమైంది, భారీ చేరికలతో జనప్రవాహం లా పోటెత్తిన “బత్తుల” ప్రజాబలం
  • రాజానగరం నియోజకవర్గంలో వైసిపి కుంభస్థలాన్ని పూర్తిస్థాయిలో బద్దలు కొట్టిన “బత్తుల”
  • “జన సునామీ”లా వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీ నుండి అతి భారీ చేరికలు
  • వైసీపీకి నిత్యం దెబ్బ మీద దెబ్బ కొడుతూ.. కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న జనసేన ఫైర్ బ్రాండ్, ప్రజా నాయకుడు “బత్తుల బలరామకృష్ణ”
  • వైస్సార్సీపీ చూపించిన కన్ని బూటకపు చేరికలకు, దిమ్మ తిరిగేలా.. బొమ్మ కనబడేలా.. అదుర్స్ అనేలా కౌంటర్ ఇచ్చి.. జనసైనికులను కాలర్ ఎగరేసేలా చేసిన బత్తుల
  • రాజానగరం నియోజకవర్గం ఇప్పుడు వందకి 100 శాతం పూర్తిగా జనసేన మయం
  • సమిష్టిగా గెలుపే లక్ష్యంగా ముందుకు కదులుతున్న జనసేన టిడిపి శ్రేణులు
  • “బత్తుల బలరామకృష్ణ” సృష్టిస్తున్న జన ప్రభంజనానికి చిన్నాభిన్నమైన ‘జక్కంపూడి’ క్యాడర్
  • రాజానగరం నియోజకవర్గంలో చాప కింద నీరులా గ్రామ గ్రామాన శరవేగంగా విస్తరిస్తున్న జనసేన పార్టీ హవా….. నిశ్శబ్ద విప్లవానికి నాంది. ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న జనసేన, టిడిపి “సైనికులు”
  • జనసేన పార్టీ క్యాడర్ లో నూతనోత్సాహం.. గ్రాఫ్ పెరగడంతో పూర్తిగా పట్టు బిగించిన జనసేన.. పూర్తిగా డీలపడ్డ వైస్సార్సీపీ

రాజానగరం నియోజకవర్గం: రాజానగరం మండలం, రఘునాథపురం గ్రామంలో అవినీతి, అరాచక పాలన చేస్తూ, నియోజకవర్గం లో పెద్ద ఎత్తున సహజ వనరులను దోచుకు తింటూ, 2019 వైసిపి పార్టీ గెలుపు కోసం కష్టపడిన సీనియర్ నేతల, కార్యకర్తల సేవలను విస్మరించి, అడ్డగోలుగా వ్యవహరిస్తూ.. అసమర్ధ పాలన చేస్తున్న స్థానిక ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వ్యవహార శైలికు విసుకు చెంది. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, సిద్ధాంతాలు ఆయన రాజకీయ ప్రయాణం, భావితరాల భవిష్యత్తు కోసం ఆయన పడుతున్న తపన.. అదే సమయంలో రాజానగరం నియోజకవర్గంలో బత్తుల బలరామకృష్ణ గారు, శ్రీమతి వెంకటలక్ష్మి దంపతులు అనునిత్యం చేస్తున్న పార్టీ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు.. నియోజకవర్గంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకుంటున్న తీరు, చేస్తున్న దానధర్మాలు, ప్రజలకు కష్టాలు వచ్చినప్పుడు ఆయన నిలబడుతున్న తీరు, ప్రజా సమస్యలపై పోరాడుతున్న ఆయన సమర్థమైన నాయకత్వానికి ఆకర్షితులై బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో రఘునాథపురం గ్రామం వైసీపీకి చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు 25 మంది జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. వీరందరికీ బత్తుల బలరామకృష్ణ జనసేన పార్టీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో పలివెల వీరవేంకట్రావు, మందాల కృష్ణ, నారాయణపురం శ్రీను, బాజీమెని బుజ్జి, మట్టా శివ, తుమ్మల సూరిబాబు, పలివెల కాళీ, రేలంగి శివచంటి, మందాల వీరబాబు, గొన్నురి సత్తిబాబు, యర్ర వీర్రాజు, బోలెపల్లి రామకృష్ణ, గొన్నురి నాగు, మరుకుర్తి వెంకటేష్, రేలంగి సూరిబాబు, రేలంగి శ్రీను, గొన్నురి వీరబాబు, మట్ట బాలరాజు, తణుకు వెంకటరావు, చల్లా వెంకటేష్, గోనబోయిన మంగాపతి, మార్గాని సత్తిబాబు, ఇతరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, గ్రామ పెద్దలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.