భద్రవరం జనసైనికులు ఆధ్వర్యంలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ

జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా మంగళవారం ఏలేశ్వరం మండలం భద్రవరం గ్రామంలో భద్రవరం జనసైనికుల ఆధ్వర్యంలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా నియోజకవర్గ పార్టీ ఇంచార్జ్ వరుపుల తమ్మయ్యబాబు మరియు ఏలేశ్వరం మండల జనసేన పార్టీ అధ్యక్షులు పెంటకోట మోహన్ పాల్గున్నారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ మాట్లాడుతూ గ్రామాల నుంచి విప్లవం వస్తేనే రాజకీయాల్లో మార్పు వస్తుంది. పార్టీ బలోపేతానికి గ్రామ స్థాయి నుండి పునాది వేయాలి. గ్రామ స్థాయి సమస్యలను ఆకళింపు చేసుకొని సామాన్యులకు అండగా నిలబడాలి. సరైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని జనసైనికులను ఉద్దేశించి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నల్లల రామకృష్ణ జిల్లా సంయుక్త కార్యదర్శి దాసం శేషారావు, జిల్లా సంయుక్త కార్యదర్శి దొడ్డి శ్రీనివాస్, ఏలేశ్వరం మండలం జనరల్ సెక్రెటరీ, సోషల్ మీడియా కన్వీనర్ గంగిరెడ్ల మణికంఠ, ఏలేశ్వరం మండలం జాయింట్ సెక్రెటరీ వీరబాబు, పలకా లోకేష్, యర్రంశెట్టి దుర్గా ప్రసాద్, సిరిపురం జనసైనికులు అచ్చే వీరబాబు యర్రవరం గ్రామ జనసేనపార్టీ అధ్యక్షులు గంగిరెడ్ల చిన్న, తిరుమల గ్రామ జనసేనపార్టీ ఉపాధ్యక్షులు బుజ్జి, యర్రవరం జనసైనికులు ఆకుల నాని, రాయపురెడ్డి దుర్గాప్రసాద్, తిరుమల జనసైనికులు ఇంద్రయ్య, నాగబాబు, భద్రవరం జనసైనికులు యర్రంశెట్టి దుర్గ ప్రసాద్, వంగలపుడి కోటిబాబు, యెజ్జు వీరబాబు కోలా రమేష్, రెడ్డి బాబ్జి, ఉమ్మిడి కొండబాబు కునిశెట్టి నాగవెంకటరమణ, ఆకన స్వామి,  ఒరుగంటి శివ, పడవల స్వామి, గున్నబత్తుల స్వామి, ఎర్రంనిడి వరప్రసాద్, చింతలపూడి లోకేష్, బత్తుల నగు, ఆకన పండు, గ్రామ కమిటీ పెద్దలు మెంటే చిట్టిబాబు, బందుల బురయ్య, కృపానందం జగటపు తతబ్బాయి మరియు ఇతర జనసైనికులు పాల్గొన్నారు.