రైతులకు అండగా జనసేన పార్టీ

రైతులకు అండగా ఉండాలని జనసేనపార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు, అదేవిధంగా నెల్లూరు జిల్లా జనసేనపార్టీ అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి నాయకత్వంలో నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం పరిధిలోని విడవలూరు మండలం, గౌరీపురం గ్రామంలో అకాల వర్షాలకు నీట మునిగిన వేరుశనగ పంట పొలాలను పరిశీలించి, పంట వేసిన రైతులను కలుసుకుని జరిగిన నష్టాన్ని అంచనావేసి ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి రైతులకు న్యాయం జరిగేవిధంగా పోరాటం చేసి రైతులను ఆదుకుంటామని కోవూరు నియోజకవర్గం జనసేనపార్టీ నాయకులు చప్పిడి శ్రీనివాసులు రెడ్డి మరియు విడవలూరు మండలం జనసేనపార్టీ అధ్యక్షులు కమతం శ్రీనాధ్ యాదవ్ ఆధ్వర్యంలో రైతులకు భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా జనసేనపార్టీ ప్రధానకార్యదర్శి మున్వర్ బాషా, కోవూరు మండలం జనసేనపార్టీ అధ్యక్షులు షేక్ అల్తాఫ్, కోవూరు మండల జనసేనపార్టీ నాయకులు సాయికృష్ణ, విడవలూరు మండల జనసేనపార్టీ నాయకులు కడియాల రాము, శివ కుమార్, రాజా, శ్రీకాంత్ మరియు రైతులు, జనసైనికులు, గ్రామస్థులు పాల్గొన్నారు.