జనసేన పార్టీ పాట గేయ రచయిత, గాయకులకు ఆర్థిక సహాయం

  • ఆర్థిక సహాయం అందించిన పూల శివ ప్రసాద్

కొత్తచెరువు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై, జనసేన పార్టీ పై రచయిత శ్రీనివాసులు మరియు గాయకులు అంజి పాట రాసి, కొత్తచెరువు జనసేన పార్టీ కార్యాలయంలో పూల శివప్రసాద్ ఆధ్వర్యంలో విడుదల చేయగా ఈ పాట ఎంతో విజయవంతమైంది. సందర్భంగా వారికి జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో సన్మానించి వారు రాయబోతున్న నూతన పాటకు ఆర్థిక సహాయంగా 10,000 రూపాయలు అందించడం జరిగింది. ఈ సందర్భంగా పూల శివప్రసాద్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్ర పైన వ్రాయబోతున్న నూతన పాట కూడా విజయవంతం కావాలని తెలియజేస్తూ వారిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో గేయ రచయిత శ్రీనివాసులు, గాయకులు అంజి, కొత్తచెరువు మండల అధ్యక్షులు పూల శివప్రసాద్, పూల వెంకటేష్, మెడపురం సల్లప్పా, ఓబిరెడ్డి ముత్యాల కరుణాకర్, దొడ్డిగుంట నరేంద్ర భూపతి, గూడా మధు, ముత్త నరేంద్ర, పూల రెడ్డప్ప, సోలంకల రాజా, శ్రీనివాసులు అయ్యా నవీన్ మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.