డ్రైనేజి సమస్యలను పరిష్కరించాలని జనసేన వినతిపత్రం

సత్యసాయి జిల్లా, పెనుకొండ నియోజకవర్గం, రొద్దం మండలంలోని రెడ్డిపల్లి గ్రామంలో డ్రైనేజి సమస్యలను పరిష్కరించాలని జనసేన పార్టీ రొద్దం మండల అధ్యక్షులు యు. గంగాధర్ ఆధ్వర్యంలో ఎంపిడిఓకి వినతిపత్రం అదించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రొద్దం నాయకులు గంగాధర్, హరీష్, తిరుపతి, వెంకటేష్, నాగభూషణ, చిరంజీవి, విజయకుమార్, నరేష్, చంద్రశేఖర్ పాల్గొన్నారు.