కొడాలి కాపులపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు జనసేన నిరసన

కాకినాడ: స్థానిక 39వ డివిజన్ జనసేన పార్టీ నాయకులు ఆకుల శ్రీనివాస్ నాయకత్వంలో మాజీ మంత్రి కొడాలి నాని కాపులపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆకుల శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రజల హర్షించే విధంగా వ్యాఖ్యలు చేయాలని సూచించారు. అంతేగాని రాజ్యాంగేతర శక్తులుగా మారి సామాజిక వర్గాల మధ్య విబేదాలు సృష్టించే విధంగా మాట్లాడడం ప్రజాప్రతినిధులకు తగదన్నారు. ఇటీవల అధికార వైఎస్ఆర్సిపి నాయకులు చేస్తున్న ఆరోపణలు మాట్లాడుతున్న వ్యవహార శైలి సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉండడం దురదృష్టకరమన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు అట్ల సత్యనారాయణ, శ్రీమన్నారాయణ, తోట నరసింహ కుమార్, సురేష్ కుమార్, కోటేశ్వరరావు, మోర్త మాలతి, మిర్యాల హైమావతి, చీకట్ల వాసు
జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.