దింపు కార్మికుని కుటుంబానికి అండగా జేగురుపాడు జనసేన

రాజమహేంద్రవరం రూరల్ కడియం మండలం జేగురుపాడు గ్రామానికి చెందిన కొబ్బరి దింపు కార్మికుడు తోట దుర్గారావు గతనెల 22 తేదీ మెర్నిపాడు గ్రామంలో కొబ్బరిచెట్టుపై నుండి పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు దుర్గారావుకు సుమారు మూడు సంవత్సరాల క్రితం రాజమండ్రికి చెందిన దుర్గాభవానితో వివాహం అయింది. వీరికి ఇద్దరు కుమారులు కాగా మొదటి కుమారునికి రెండు సంవత్సరాలు, రెండో కుమారుడుకి అయిదు నెలల వయస్సు కుటుంబానికి పెద్దదిక్కు దుర్గారావు మృతితో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉన్న తరుణంలో మేమున్నాం అంటూ జేగురుపాడు జనసైనికులు గ్రామంలో ఎంపీటీసీ నాగిరెడ్డి సూర్య రామకృష్ణ ఆధ్వర్యంలో కొంతమంది ఔదార్యం కలిగిన గ్రామస్తుల నుండి సేకరించిన సొమ్ము చెక్కు రూపంలో 75000 నగదు రూపంలో 6500 రూపాయలను జనసేన తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల లక్ష్మీ దుర్గేష్ చేతుల మీదుగా జనసైనికులు దుర్గారావు భార్య దుర్గాభవానికి గురువారం అందజేశారు. ఈ కార్యక్రమంలో కడియం మండల జనసేన అధ్యక్షుడు ముద్రగడ జెమీ, కర్రి చినబాబు, పాలపర్తి ప్రకాశ్ కుమార్, కొక్కిరిమట్ల శ్రీనివాస్, కొండేపూడి బాలాజీ, ఆకుల రమేష్, పల్ల దుర్గారావు, హనుమంతు శ్రీను మరియు జనసైనికులు భారీగా పాల్గొన్నారు.